News April 11, 2024
మెదక్: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోలు అంతంతే..!

అధికారులు ఆర్భాటంగా దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో 2,60,933 ఎకరాల్లో వరి సాగవగా.. 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పంట సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 200కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పూర్తిస్థాయిలో కోనుగోళ్లు చేయట్లేదని రైతులు అంటున్నారు.
Similar News
News April 6, 2026
మెదక్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీజేపీ మెదక్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.
News April 6, 2026
మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు

మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు ఎన్నికయ్యారు. మెదక్లో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షునిగా సుధాకర్ రాజు, బీవీకే రాజు, సుదర్శన్ రాజు, చంద్ర శేఖర్ రాజు, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా వెంకట నరసింహ రాజు, కోశాధికారిగా పూర్ణ చందర్ రాజు, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్ రాజు, రామ రాజు, కార్యదర్శులుగా పృథ్విరాజు, మోహన్ రాజు, ప్రచార కార్యదర్శిగా వికాస్ ఎన్నికయ్యారు.
News April 6, 2026
మెదక్: ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024-25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటమే ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.


