News November 5, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.
Similar News
News March 22, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం: ఎస్పీ

ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా 1 ఫిబ్రవరి 2026 నుంచి ఇప్పటివరకు 41 పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. 159 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.4,82,394 స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే 10 కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించి 84 మందిని అదుపులోకి తీసుకున్నామన్నాడు. వారి నుంచి రూ.2,10,180 నగదు, కోళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
News March 22, 2026
ఒంగోలులో జాబ్ మేళా.. రూ.41 వేల జీతం.!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పలు ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని, 18 నుంచి 35 ఏళ్ల వయసు గలవారు అర్హులని తెలిపారు. రూ.14 వేల నుంచి రూ.41 వేల వరకు వేతనం అందే అవకాశం ఉందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చన్నారు.
News March 22, 2026
ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్లైన్లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.


