News November 5, 2025
ANU: బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత జులై నెలలో జరిగిన బీటెక్ ll, lV ఇయర్స్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. 179 మందికి గాను 100 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్కు ఈ నెల 17వ తేదీ లోపు రూ. 2,070 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
Similar News
News March 21, 2026
మాజీ ఎమ్మెల్యే భౌతికకాయంపై టీడీపీ జెండాతో నివాళులు

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హనుమంతరావు చౌదరి భౌతికకాయంపై టీడీపీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, నాయకుడిగా టీడీపీకి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.
News March 21, 2026
తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: సీఎం

AP: తిరుమలలో భక్తులకు అందే సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని CM CBN అధికారులను ఆదేశించారు. TTD పరిధిలోని ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ ‘తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలి. అత్యాధునిక CCTVలు, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.
News March 21, 2026
బాపట్ల జిల్లాలో గ్యాస్ సిలెండర్లపై UPDATE

బాపట్ల జిల్లాలో గ్యాస్ కొరతలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా పేర్కొన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో 5,377 గ్యాస్ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వినియోగదారులు ఆందోళన చందవద్దన్నారు. సిలెండర్లు బరువు తగ్గిన అధిక ధరలకు విక్రయించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు.


