News November 5, 2025
పల్వంచ: చదువుల తల్లికి గుడి కట్టిన దేవుళ్లు వీరే!

ఫరీద్పేట్ గ్రామంలో నూతన గ్రంథాలయం బుధవారం ప్రారంభమైంది. జీడిపల్లి నర్సింహా రెడ్డి తన కూతురు, తండ్రి స్మారకార్థం రూ. 20 లక్షల సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, యువకులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని దంపతులిద్దరూ ఆకాంక్షించారు. గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేసిన వీరికి పలువురు అభినందించి శాలువాతో సత్కరించారు.
Similar News
News November 6, 2025
ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.
News November 6, 2025
హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్తో జరిగే ఈవెంట్లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
News November 6, 2025
HYD: గోపి నా పెద్దకొడుకని అక్షరను హత్తుకున్న అవ్వ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రహమాత్నగర్లోని ఫాతిమా నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో ఓ అవ్వ ‘గోపీ నా పెద్ద కొడుకు అని గుర్తు తలుచుకుంటూ.. నా మనుమరాలు అని ఆప్యాయంగా అక్షరను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా దీవించారు. మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంటెపాక నరేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.


