News November 5, 2025

సామూహిక దీపారాధనలో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహించిన సామూహిక దీపారాధన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే పాల్గొన్నారు. శ్రీ భీమేశ్వరాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. కాగా, సామూహిక దీపారాధన కార్యక్రమంలో భాగంగా భక్తులు వివిధ ఆకారాల్లో వెలిగించిన దీపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Similar News

News March 15, 2026

సంగారెడ్డి: రేపటి నుంచి ఒంటి పూట బడి

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 16 నుంచి ఒంటి పూట బాటలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా రెండు పూటలా పాఠశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 15, 2026

సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’ వెబ్‌సైట్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు కేవలం ప్రత్యక్షంగానే కాకుండా ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

News March 15, 2026

కడప: 16 నుంచి పశువులకు టీకాలు

image

ఈనెల 16 నుంచి ఏప్రిల్ 20 వరకు జిల్లాలో ప్రతి గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్.ఏ.శ్రీనివాసులు తెలిపారు. కడప జిల్లాకు 3 లక్షల డోసులను కేటాయించామన్నారు. పాడి పశువుల యాజమానులందరూ పశువైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. గాలి కుంటు వ్యాధి సోకుతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.