News November 6, 2025

పల్నాడు: ‘మంజూరైన ఇళ్లను పూర్తి చేయాలి’

image

పీఎం జన్‌మన్ పథకం ద్వారా మంజూరైన ఇళ్లను మార్చినాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో పీఎం జన్‌మన్ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెంచుల నివాసాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అటవీ శాఖ నుంచి అనుమతులు పొందాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో తాగునీటి పైప్‌లైన్‌, మొబైల్ టవర్లు వంటి నిర్మాణాల కోసం అనుమతులు పొందే విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు.

Similar News

News April 1, 2026

మెదక్ జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదు

image

మెదక్ జిల్లాలో ఎక్కడా LPG గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాధికారి నిత్యానంద్ తెలిపారు. 16 ఏజెన్సీల ద్వారా రోజుకు సుమారు 3,200 సిలిండర్లు బుకింగ్ కాగా, 100% డెలివరీ జరుగుతోందన్నారు. గోదాముల్లో 3,500 సిలిండర్లు ఉండగా, 6,179 ట్రాన్సిట్‌లో ఉన్నాయన్నారు. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు కమర్షియల్ సిలిండర్లనే వాడాలని, డొమెస్టిక్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 1, 2026

PHOTO GALLERY: పండు వెన్నెల్లో అందాల రామయ్య పెళ్లి

image

AP: కడప(D) ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం చూసి వేలాది మంది భక్తులు పులకించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా ఈ నెల 5వ తేదీ వరకు ఒంటిమిట్టలో ఉత్సవాలు కొనసాగనున్నాయి.

News April 1, 2026

MDK: ఏడుపాయలో ఘనంగా దుర్గమ్మ పల్లకీ సేవ

image

మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి, ఆలయ ప్రాంగణంలో శోభాయాత్రగా ఊరేగించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంతో నిండిపోయాయి. అంతకుముందు మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.