News November 6, 2025
ఆర్డీవోలు తహశీల్దార్లతో సమీక్షించాలి: VZM కలెక్టర్

రెవెన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ వినతులు ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, OBC, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు వంటి సేవలు నిర్దేశిత గడువు దాటకుండా పూర్తవ్వాలని, ఆర్డీవోలు రోజువారీగా తహశీల్దార్లతో సమీక్షించాలన్నారు.
Similar News
News March 16, 2026
VZM: నేడే పదవ తరగతి పరీక్షలు

నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని 119 కేంద్రాల్లో 23,529 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.9:30 నుంచి మ.12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. హాల్ టికెట్పై సంబంధిత స్కూల్ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతించనున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. సందేహాలు ఉంటే 7382157686 ఫోన్ చేయవచ్చు. ఆల్ ది బెస్ట్.
News March 16, 2026
భోగాపురం కనెక్టివిటీ రోడ్ల క్లియరెన్సుకు సీఎం ఆదేశం: మంత్రి నారాయణ

భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.
News March 16, 2026
భోగాపురం కనెక్టివిటీ రోడ్ల క్లియరెన్సుకు సీఎం ఆదేశం: మంత్రి నారాయణ

భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.


