News November 6, 2025
కర్నూలులో నేడే జాబ్ మేళా

కర్నూలులో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి దీప్తి తెలిపారు. ఈ మేళాలో రిలయన్స్ కన్స్యూమర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ ఖాళీలు 120 ఉన్నాయన్నారు. ఐటీఐ/డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ముందుగా ఎన్సీఎస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 14, 2026
ASF: గుండెపోటుతో వార్డు మెంబర్ మృతి

కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు తారాబాయి(50) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఉదయం ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రజా ప్రతినిధి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 14, 2026
HNK: పల్లె సీమలు.. అభివృద్ధి వైపు అడుగులు..!

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 208 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ నిధులను వర్షపు నీటి నిల్వ, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ పనులకు మాత్రమే ఉపయోగిస్తారు. 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలకు సంబంధించిన స్థానిక అభివృద్ధి పనులకు రోడ్లు, డ్రైనేజీ ఈ నిధులను వినియోగించనున్నారు. .గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక (GPDP) రూపొందించి, గ్రామ సభ ఆమోదంతో ఈ పనులు చేపడతారు.
News March 14, 2026
ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో నెం.1గా నిలపాలి: కలెక్టర్

రహదారి ప్రమాదాలను తగ్గించి, ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బ్లాక్ స్పాట్ల వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు.


