News April 11, 2024
ప్రచారాన్ని చూసేందుకు 25 దేశాలకు బీజేపీ ఆహ్వానం

లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రచార తీరును చూసేందుకు బీజేపీ 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. అందుకు జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి 13 దేశాల్లోని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో భారత్కు రానున్న ఆయా దేశాల పార్టీల ప్రతినిధులు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాలను చూడనున్నారు. అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో అక్కడి పార్టీలను బీజేపీ ఆహ్వానించలేదు.
Similar News
News January 28, 2026
మేడారం జాతరలో బెల్లమే బంగారం.. ఎందుకంటే?

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా చూస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరికలు తీరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు.
News January 28, 2026
వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

<
News January 28, 2026
చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు

మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్కు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నెరవేరలేదు. ‘సీఎం కావాలనుకుంటున్నాను’ అని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేసినా సీఎం కుర్చీ మాత్రం అజిత్ దాదాకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే మహారాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా <<18980541>>రికార్డు<<>> సృష్టించారు.


