News November 6, 2025

ఏపీలోని ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి: తుమ్మల

image

TG: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెంను తిరిగి విలీనం చేయాలని కోరారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం.

Similar News

News March 21, 2026

‘ధురంధర్ 2’ సంచలనం.. ₹331 కోట్ల కలెక్షన్లు!

image

ధురంధర్ 2 మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రిలీజైన 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹331 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో ₹267 కోట్లు, ఓవర్సీస్‌లో ₹64 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. ఇండియాలో ప్రివ్యూస్‌తో ₹51కోట్లు, తొలిరోజు ₹121 కోట్లు, రెండోరోజు ₹96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పింది. వీకెండ్ కావడంతో మరో 2 రోజుల్లో మూవీ ₹500 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది.

News March 21, 2026

డిన్నర్‌కు వెళ్లా అంతే..: పుట్టా మహేశ్

image

AP: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో TDP అధిష్ఠానానికి MP పుట్టా మహేశ్ వివరణ ఇచ్చారు. డిన్నర్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో TDP <<19392082>>షోకాజ్<<>> నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు TG మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికీ BRS షోకాజ్ నోటీస్ ఇవ్వగా ఆయన స్పందించాల్సి ఉంది.

News March 21, 2026

₹18 కోట్లు చెల్లించి హార్ముజ్‌ను దాటిన నౌక!

image

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్ <<19429670>>టోల్ ఫీజు<<>> వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్‌గా వెళ్లేందుకు ఓ చమురు నౌక $2 మిలియన్లు(₹18.7 కోట్లు) చెల్లించినట్లు లాయిడ్స్ లిస్ట్ వెల్లడించింది. ఇండియా, మలేషియా, చైనా, పాక్ సహా పలు దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా 9 నౌకలు ఇరాన్ తీరం నుంచి వెళ్లినట్లు పేర్కొంది.