News April 11, 2024

MBNR, NGKL: 5ఏళ్లు.. 3,27,451 మంది ఓటర్లు

image

ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో(10.67 శాతం) 3,27,451 మంది ఓటర్లు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి MBNR లోక్‌సభ పరిధిలో 16,80,417, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 17,37,773కు ఓటర్ల సంఖ్యం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 68వేల ఓట్లు నమోదుయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 18-39 ఏళ్ల మధ్య ఓటర్లు 52 శాతం ఉన్నారు. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి.

Similar News

News March 4, 2026

పాలమూరు:జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✔ఘనంగా హోలీ వేడుకలు
✔తుమ్మన్‌పేటతో విడదీయలేని అనుబంధం: హీరో విజయ్‌ దేవరకొండ
✔జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు:SP
✔పాలమూరు: డ్రంక్ అండ్ డ్రైవ్.. 5 మంది డ్రైవర్లకు జైలు శిక్ష
✔జడ్చర్ల: మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు
✔పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
✔శరవేగంగా మహబూబ్‌నగర్ – దేవరకద్ర రైల్వే పనులు
✔చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత

News March 3, 2026

జడ్చర్ల మృతదేహం సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

image

రాష్ట్రవ్యాప్తంగా సంచలమైన సృష్టించిన జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News March 3, 2026

MBNR: జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు: SP

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు లేదా ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరంగా చర్యలకు గురయ్యే అంశాలుగా పరిగణించబడతాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. SHARE IT