News November 6, 2025
కార్తీక మాసం.. అయినా చికెన్ ధరలు తగ్గలే..!

నల్గొండలో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ.200కు పైగానే అమ్ముతున్నారు. కార్తీక మాసం ప్రారంభమైనప్పటికీ ధరలు యథావిధిగా ఉన్నాయని చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్కిన్లెస్ రూ.220 నుంచి రూ.245 వరకు విక్రయించారు. విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.215 మధ్య అమ్మకాలు జరిపారు. మరి కొన్ని రోజులు ఇదే విధంగా ధరలు ఉండనున్నాయి. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
Similar News
News March 22, 2026
ADB: చెప్పి చనిపోయిన రైతు.. స్పందించిన కలెక్టర్

ఆదిలాబాద్(రూ) మండలం అర్లి(బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి <<19439320>>ఆత్మహత్య <<>>ఘటనపై కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. గత నవంబర్ 18, 2025న గణపతి తీసుకువచ్చిన సోయాబీన్లో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టి మళ్లీ తీసుకురావాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. 81 క్వింటాళ్ల సోయాబీన్కు సంబంధించిన మొత్తం చెల్లింపులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
News March 22, 2026
కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

కేరళంలోని కోళికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
News March 22, 2026
అనంత: ఈతకెళ్లి బాలుడి మృతి

అనంతపురం జిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్(13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


