News November 6, 2025

ఇదేం నిబంధన.. ‘7 క్వింటాళ్ల పరిమితిపై’ రైతుల ఆవేదన

image

నల్గొండ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి సేకరణలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ‘దిక్కుమాలిన నిబంధన.. ఏడ్చినట్టే ఉంది’ అని రైతులు మండిపడుతున్నారు. తేమశాతం, పింజ పొడవు నిబంధనలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవాలని వారు సీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Similar News

News April 1, 2026

₹50 నుంచి ₹కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి..!

image

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తొలినాళ్లలో రెమ్యునరేషన్ గురించి తోటి నటుడు శ్రీనివాసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1980లో ‘విలక్కనుండు స్వప్నంగళ్’ అనే సినిమాలో చేసిన పాత్రకు మమ్ముట్టికి ఇచ్చింది 50 రూపాయలేనని తెలిపారు. అందులో గుర్తింపు రావడంతో ఆ తర్వాత సినిమా ‘మేళా’కు ₹800 అందుకున్నారని చెప్పారు. ఆ ₹800లకే మమ్ముట్టి ఎంతో సంతోషపడ్డారని అన్నారు. కాగా ప్రస్తుతం మమ్ముట్టి ₹10-20Cr అందుకుంటున్నారు.

News April 1, 2026

వరంగల్: నేటి నుంచే 10TH పేపర్ల మూల్యాంకనం

image

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి కాజీపేటలోని ఫాతిమా హై స్కూల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో సుమారు 2.40 లక్షల పేపర్లను మూడు విడతల్లో దిద్దనున్నారు. ఏప్రిల్ 1– 9 వరకు భాషలు, గణితం, 10– 17 వరకు సైన్స్, 18– 23 వరకు సాంఘికం, వొకేషనల్ పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. ఏర్పాట్లను డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్ పరిశీలించారు.

News April 1, 2026

హనుమకొండ: రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రాత్రి వరకు రద్దీ

image

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. హనుమకొండలో సాధారణంగా రోజుకు 108 స్లాట్లు ఉండగా, ఈనెల 28 నుంచి 31 వరకు అదనంగా 80 స్లాట్లను పెంచారు. ఈనెల 28న 150, 30న 170 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంగళవారం సాయంత్రం వరకు 120 స్లాట్లు బుక్ కాగా, 112 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నిన్న చివరిరోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు బారులు తీరారు.