News November 6, 2025

సంగారెడ్డి: చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

image

చీమలకు భయపడి వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) మైర్మేకోఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 13, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. జమ్మికుంటలోని ఆర్‌వోబీ ఫ్లైఓవర్‌పై నుంచి దూకి <<19365742>>రాం శివరాజ్<<>>(28), ధర్మారం(M) నర్సింహులపల్లికి చెందిన <<19364283>>శంకరయ్య<<>>(73), కోనాయిపల్లి శివారులో <<19367858>>రాజూరి వీరాచారి<<>>(40), జమ్మికుంటకు చెందిన <<19367714>> కర్రయ్య<<>>లు ఉరి వేసుకొని, మంథని మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<19368176>>గోబు తిరుపతి<<>>(30) మృతి చెందారు.

News March 13, 2026

బాపట్ల: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

​పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని బాపట్ల DEO శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. మొబైల్‌లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.

News March 13, 2026

మెదక్: రైలు ఎక్కుతుండగా కాలు తెగింది!

image

కదులుతున్న రైలు దిగే ప్రయత్నంలో మధ్యప్రదేశ్ వాసి తీవ్రంగా గాయపడ్డాడు. రామాయంపేటలోని ఓ కంపెనీలో పనిచేసే బిహారీ లాల్ (50), గురువారం రాత్రి మనోహరాబాద్ స్టేషన్‌లో రైలు ఆగడంతో కిందికి దిగాడు. రైలు కదలడంతో ఎక్కుతుండగా ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య ఇరుక్కుపోకి కుడి కాలు తెగింది. గమనించిన స్థానికులు తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.