News November 6, 2025
మంచిర్యాల: కళ్లు దానం చేసిన ఎల్ఐసీ ఏజెంట్

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ఎల్ఐసీ ఏజెంట్ తన కళ్లను దానం చేశాడు. మంచిర్యాలకు చెందిన రాజన్న(56) నవంబర్ 1న ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్కు తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించగా కుటుంబ సభ్యులు ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు.
Similar News
News November 6, 2025
బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ

పాచిపెంట మండలం పి.కొనవలస ఆంధ్రా- ఒడిశా ఘాట్ రోడ్డులో ఒడిశా ఆర్టీసి బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి పర్యటించారు. గురువారం సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్, ప్రయాణికులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందనేది కారణాలు తెలుసుకున్నారు.
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 6, 2025
ముగిసిన తొలి విడత పోలింగ్

బిహార్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.


