News November 6, 2025
ఎల్లారెడ్డి: సలహాదారుడిని కలిసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.
Similar News
News November 6, 2025
బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ

పాచిపెంట మండలం పి.కొనవలస ఆంధ్రా- ఒడిశా ఘాట్ రోడ్డులో ఒడిశా ఆర్టీసి బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి పర్యటించారు. గురువారం సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్, ప్రయాణికులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందనేది కారణాలు తెలుసుకున్నారు.
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 6, 2025
ముగిసిన తొలి విడత పోలింగ్

బిహార్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.


