News November 6, 2025

గద్వాల్: మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు- SP

image

జిల్లాలో మహిళల, బాలికల రక్షణకై పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, తక్షణ స్పందనతో కాల్ చేసిన వారికి భరోసా, రక్షణ కల్పిస్తూ ఆకతాయిలకు చెక్ పెడుతుందని ఎస్పీ శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312కు కాల్ చేసి సేఫ్‌గా ఉండాలని అన్నారు. మహిళలను, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 6, 2025

బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ

image

పాచిపెంట మండలం పి.కొనవలస ఆంధ్రా- ఒడిశా ఘాట్ రోడ్డులో ఒడిశా ఆర్టీసి బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి పర్యటించారు. గురువారం సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్, ప్రయాణికులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందనేది కారణాలు తెలుసుకున్నారు.

News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 6, 2025

ముగిసిన తొలి విడత పోలింగ్

image

బిహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్‌లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.