News April 11, 2024
BPL: రెండు బైకులు ఢీ .. ఒకరి మృతి

బనగానపల్లె పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. చాగలమర్రి మండల కేంద్రానికి చెందిన జమాల్ బాషా(27) పని నిమిత్తం బైక్పై బనగానపల్లెకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో, ఎదురుగా వస్తున్న బైక్ ఈయన్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో జమాల్ బాషా అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News March 20, 2026
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో వస్తున్న నకిలీ కాల్స్, లింక్స్పై రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
తెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పొద్దని, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.
News March 20, 2026
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో వస్తున్న నకిలీ కాల్స్, లింక్స్పై రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
తెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పొద్దని, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.
News March 18, 2026
ఈనెల 21న రగ్బీ మహిళల ఛాంపియన్షిప్ పోటీలు

ఈనెల 21, 22వ తేదీల్లో కర్నూలు శివారులోని రిడ్జ్ పాఠశాల క్రీడా మైదానంలో ఏపీ స్టేట్ అస్మిత రగ్బీ మహిళల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రగ్బీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు బుధవారం వెల్లడించారు. అండర్-15 సబ్ జూనియర్ విభాగంలో బాలికలకు, సీనియర్ విభాగంలో మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు కప్పు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.


