News November 6, 2025
SRSPకి తగ్గిన ఇన్ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గింది. ఈరోజు ఉదయం ఇన్ఫ్లో 21,954 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 21,954 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో 12,500 క్యూసెక్కులు స్పిల్వే గేట్ల ద్వారా, 8,000 క్యూసెక్కులు ఎస్కేప్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నారు. అటు సరస్వతి కాలువ, మిషన్ భగీరథకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 4 గేట్లను తెరచి ఉంచారు. మొత్తం నీటినిల్వ 80.5 TMCగా ఉంది.
Similar News
News March 25, 2026
మారనున్న చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

ఉ.చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పురుషులదే హవా. ప్రస్తుత రాజకీయాల్లో ఒక్క మహిళా MP, MLAగా లేరు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే ఈ లెక్క మారనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏడుగురు మహిళలు MLAలు కానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే తాను MLAగా బరిలో ఉంటానని సుధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మూడు MP స్థానాల్లో ఓ స్థానం మహిళకు వెళ్లే అవకాశం ఉంది.
News March 25, 2026
మారనున్న చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

ఉ.చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పురుషులదే హవా. ప్రస్తుతం ఒక్క మహిళ కూడా MP, MLAగా లేరు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే ఈ లెక్క మారనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏడుగురు మహిళలు MLAలు కానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే తాను MLAగా బరిలో ఉంటానని సుధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మూడు MP స్థానాల్లో ఓ స్థానం మహిళకు వెళ్లే అవకాశం ఉంది.
News March 25, 2026
KNR: అసెంబ్లీలో ఐదుగురు ‘మహిళా’ మణులు?

పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుండటంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి KNR(D)లో రాజకీయం కొత్త పుంతలు తొక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో 13 నుంచి 20 స్థానాలకు పెరగనున్న నేపథ్యంలో కనీసం 4- 5 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో కీలక స్థానాల్లో మహిళా నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.


