News November 6, 2025

SRD: జాతీయ సాహస శిబిరానికి ‘తార’ విద్యార్థిని

image

కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచు కొండల ప్రాంతంలో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీవిద్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ గురువారం తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా, శ్రీవిద్య అందులో ఒకరు. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు మనాలిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.

Similar News

News March 27, 2026

కారంచేడులో నాణేల ప్రదర్శన

image

కారంచేడు కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఆదిపూడికి చెందిన కాలువ రఘురామయ్య సేకరించిన అత్యంత పురాతనమైన, సీతాసమేత శ్రీరామచంద్రుడి చిత్రాలు కలిగిన నాణేల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అపురూప నాణేలను తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

News March 27, 2026

ప్రతి చిన్న విషయానికి సారీ అక్కర్లేదు: సమంత

image

ఒకే పరిస్థితి ఎదురైనప్పుడు మగాళ్లతో పోలిస్తే మహిళలు 10రెట్లు ఎక్కువగా సారీ చెబుతున్నారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదని, తమను తాము తగ్గించుకోవడం ఆపాలని కోరారు. ఇక మూవీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్లు గుర్తింపునకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ మూవీలను రిస్క్‌లాగా చూడటం ఆపాలని ముంబైలో జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలో తెలిపారు.

News March 27, 2026

విజయవాడ: ఈ నెల 30 వరకు గడువు పొడిగింపు

image

రైల్వే-గ్రూప్ డి పరీక్షకు సిద్ధమయ్యే BC, SC, ST అభ్యర్థులకు BC స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్లాసులలో జాయినయ్యే ఆసక్తి ఉన్న అభ్యర్థులు విజయవాడ అశోక్‌నగర్, పండరీపురం రోడ్ నం: 8లో ఉన్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించి ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. గతంలో పేర్కొన్నట్లు దరఖాస్తు గడువు ఈ నెల 25న ముగిసిందని, 30వ తేదీ వరకు గడువు పొడిగించామని చెప్పారు.