News November 6, 2025
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసం చేసే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. మోసగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ కాల్స్ చేసి, ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీపై కేసు నమోదైంది, మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తాం అంటూ భయపెట్టి, డబ్బులు బదిలీ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. మోసపూరిత కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.
Similar News
News March 3, 2026
సీఎం సమీక్ష.. పాల్గొన్న వరంగల్ కలెక్టర్

ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”పై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై స్పష్టత ఇవ్వాలని, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
News March 3, 2026
అనుమతి లేకుండా నియామకాలు వద్దు: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టొద్దని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డీఎంహెచ్వో, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియామక ప్రక్రియకు సంబంధించి ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట ఏరియా ఆసుపత్రి సహా రీజనల్ ఐ హాస్పిటళ్లలో త్వరలోనే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
News March 3, 2026
ప్రభుత్వాసుపత్రిలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, డాక్టర్లు సమయపాలన పాటించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సూపరిండెంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.


