News November 6, 2025

దేశంలో అత్యంత పురాతనమైన శివలింగం!

image

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం గురించి తెలుసుకుందాం. తిరుపతి(D) గుడిమల్లం పరశురామేశ్వరాలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ ఆలయం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదని, ఆలయంలోని శివలింగం సుమారు 2,300 ఏళ్లనాటిదని అంచనా వేశారు. ఇక్కడి లింగం సాధారణ రూపంలో కాకుండా, మానవ రూపంలో (వేటగాడి రూపం) రాక్షసుడి భుజాలపై నిలబడినట్లు ఉంటుంది.

Similar News

News March 17, 2026

ఏపీకి అదనపు LPG, తెలంగాణకు ఎప్పుడు?

image

ఏపీకి కేంద్రం అదనంగా <<19410312>>24,000<<>> మెట్రిక్ టన్నుల LPGని కేటాయించగా, తెలంగాణ ఇంకా స్పందన కోసం ఎదురుచూస్తోంది. వాణిజ్య అవసరాల కోసం అదనపు LPG కోరుతూ మంత్రి ఉత్తమ్ 3 రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో కొరతతో హోటల్ పరిశ్రమ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. నేటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉత్తమ్ కేంద్ర అధికారులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.

News March 17, 2026

పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సానియా మీర్జాకు భయానక అనుభవం!

image

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. అక్కడ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆమె మీడియాకు వివరించారు. ‘మేమున్న ఇంటి పైనుంచే యుద్ధ విమానాలు వెళ్లడం, అవి ఒకదానినొకటి అడ్డుకోవడం చూశాం. మా ఇంటికి 400-500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడ్డాయి’ అని తెలిపారు.

News March 17, 2026

దీదీని ఓడించేందుకు BJP మాస్టర్ ప్లాన్!

image

<<19408277>>మమతా బెనర్జీ<<>>ని ఆమె కోటలోనే కట్టడి చేసేందుకు BJP మాస్టర్ ప్లాన్ వేసింది. బలమైన నేత సువేందును పోటీకి దింపి దీదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకట్ట వేయనుంది. 2021లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన ఆయన ఇప్పుడు భవానీపూర్‌లోనూ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గుజరాతీ, మార్వాడీ వంటి నాన్-బెంగాలీ ఓటర్లు 40% ఉండటంతో ఇక్కడ పోటీ టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీదీని డిఫెన్స్‌లో పడేయాలన్నది BJP అసలు స్కెచ్.