News November 6, 2025

KMR: మిడ్ డే మీల్స్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని వినతి

image

పెండింగ్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. MDM నిర్వహణ కమిటీ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.8 కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.

Similar News

News November 7, 2025

కడప: శ్రీ చరణికి రూ.10 లక్షలు ప్రకటించిన ఎంపీ మేడా

image

వరల్డ్ కప్‌లో సత్తా చాటిన ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణికి రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన చరణి చూపిన ప్రతిభ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ బహుమతి ప్రకటించానని ఆయన చెప్పారు.

News November 7, 2025

రేషనలైజేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

image

జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలను కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. ప్రతిపాదించిన కేంద్రాలను స్వయంగా పరిశీలించి, నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో 1,629 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, కొత్తగా 113 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. కొత్త కేంద్రాలు ప్రైవేట్‌ పాఠశాలలు, రాజకీయ సంబంధిత భవనాల్లో ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు.

News November 7, 2025

విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

image

ఆటోలు కళాశాలల స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టంచేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, రోడ్ల వెంట ఆటోలను నిలపడం, మద్యం తాగి వాహనాలు నడిపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.