News November 6, 2025
MHBD: బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య

బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ రాంబాబు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య మమత తెలిపిన వివరాలిలా.. 15ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న రాంబాబు ఈ మధ్య కాలంలో విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండటంతో పలుమార్లు ఉన్నత అధికారులు హెచ్చరించినా తీరు మారకపోవడంతో సస్పెండ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్న రాంబాబు తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Similar News
News April 2, 2026
YCP కాదు.. ‘వనభోజనం’ పార్టీ అని పెట్టుకో: MLA గోరంట్ల సెటైర్..!

వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కారిడార్పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ట్విటర్(X) వేదికగా విమర్శలు గుప్పించారు. పార్టీలోని ముఖ్య నేతలైన వంశీలోని VA, నానిలో NA, బొత్సలో BO, జగన్లో JA, అప్పల నాయుడులో NA తీసుకుంటే VA-NA-BO-JA-NA వస్తుందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని వనభోజనంలా భుజించారని విమర్శిస్తూ, ‘వనభోజనం పార్టీ’గా పేరు మార్చుకోవాలని సూచించారు.
News April 2, 2026
క్రికెట్కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్బై

సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్డెర్ డసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రొటీస్ బోర్డుకు, సహచర ఆటగాళ్లకు, అండగా నిలిచిన కోచ్లు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 37 ఏళ్ల డసెన్ SA తరఫున 71 వన్డేల్లో 2,657 పరుగులు, 57 టీ20ల్లో 1,406, 18 టెస్టుల్లో 905 రన్స్ చేశారు. 2022 IPLలో RR తరఫున, SA లీగ్లో MI కేప్టౌన్ తరఫున ఆడారు.
News April 2, 2026
రీసర్వే పనులను పరిశీలించిన కలెక్టర్

గోరంట్ల మండలం గౌనివారిపల్లిలో జరుగుతున్న రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. సర్వే నంబర్లు 136 నుంచి 140 వరకు ఉన్న 40 ఖాతాల భూములను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారికి నోటీసులు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. భూ వివాదాలు లేకుండా పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


