News November 6, 2025

20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

image

బిహార్ భీమ్‌బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్‌ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.

Similar News

News March 25, 2026

ఇందిరపై కామెంట్స్.. సభలో బీజేపీ Vs కాంగ్రెస్

image

TG: ఇందిరపై రాకేశ్ రెడ్డి <<19474706>>కామెంట్స్<<>> సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా ఎవరు చేసినా సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అనడంతో BRS MLA సంజయ్, BJP MLAలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి అడ్డుపడ్డారు. దీంతో వారిని కూర్చోండంటూ మంత్రి ఆగ్రహించారు. ఇక రాకేశ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి అన్నారు.

News March 25, 2026

పొదుపులో మహిళలు మహారాణులే.. కానీ!

image

డబ్బు దాచడంలో భారత మహిళలు ముందున్నా పెట్టుబడుల విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70%మంది మహిళలు పొదుపు చేస్తున్నారు. అయితే ఇందులో 40%మంది మాత్రమే FD, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులపై కాకుండా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవగాహన లేకపోవడం, నష్టభయం వల్ల చాలామంది వీటికే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది తమ ఆదాయంలో 10% కంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నారట.

News March 25, 2026

ఇందిర అంటే గౌరవమే.. తప్పేమీ మాట్లాడలేదు: రాకేశ్ రెడ్డి

image

TG: అసెంబ్లీలో ఇందిరపై తన <<19474706>>వ్యాఖ్యల<<>> పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘ఇందిరా గాంధీ ఉక్కుమహిళ, ఆమె అంటే మాకు గౌరవమే. నేను తప్పేమీ మాట్లాడలేదు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇప్ప సారా తయారుచేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తా. తమాషా చేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా?’ అని అన్నారు.