News November 6, 2025

‘ఉచితం, తక్కువ లాభం’ అంటే మోసమే: ఏసీపీ

image

సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం పేరుతో భయపెడుతూ, మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచితం లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది మోసమే అని గ్రహించాలని ప్రజలకు ఏసీపీ సూచించారు.

Similar News

News March 24, 2026

25న వరంగల్ డీసీసీ బ్యాంక్ మహాసభ

image

వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీ) మహాసభ ఈ నెల 25న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సీఈఓ మహ్మద్ వజీర్ సుల్తాన్ తెలిపారు. నక్కలగుట్టలోని డీసీసీ బ్యాంక్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన సభ జరగనుంది. బ్యాంక్ అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలపై చర్చలు జరగనున్నాయి. సభ్యులందరూ సమయానికి హాజరై సభను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

News March 24, 2026

పోలవరం: తల్లి మరణం.. దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరీక్ష రాసిన విద్యార్థిని

image

తల్లి మరణించిన దుఃఖంలో టెన్త్ పరీక్ష రాసింది ఓ విద్యార్థిని. ఈ సంఘటన పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో సోమవారం చోటు చేసుకుంది. కొయ్యురు మండలం కొత్తపల్లికి చెందిన సావిత్రి తల్లి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. రాజవొమ్మంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆ బాలిక సోమవారం లెక్కలు పరీక్ష రాసింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె పరీక్ష రాయడంతో తోటి విద్యార్థినులు, టీచర్స్ చలించిపోయారు.

News March 24, 2026

కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

image

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్‌ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్‌ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.