News November 6, 2025

బెదిరింపు కాల్స్ వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ శబరిశ్

image

సైబర్‌ మోసగాళ్ల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. ఇటీవల ములుగులోని ఓ మెడికల్ షాపు యజమానికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌లమని బెదిరించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమానిత వ్యక్తుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఎవరికైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News March 20, 2026

మేకలకు ‘వైడ్ యాంగిల్’.. గద్దలకు ‘బైనాక్యులర్’ విజన్!

image

జీవులన్నింటిలో మేకలు, గద్దలు విభిన్న దృష్టి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. మేకలు తమ దీర్ఘచతురస్రాకార కనుపాపల ద్వారా తల తిప్పకుండానే 320 డిగ్రీల వరకు చూడగలవు. గడ్డి మేస్తున్నప్పుడు కూడా శత్రువులను పసిగట్టేలా ప్రకృతి వీటికి ఈ ‘వైడ్ యాంగిల్’ చూపును ఇచ్చింది. అలాగే గద్దలు కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా నేలపై చిన్న ఆహారాన్ని స్పష్టంగా చూస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో.

News March 20, 2026

KMR: మాక్ డ్రిల్ ఏర్పాట్లను పర్వేక్షించిన జిల్లా అధికారులు

image

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో మరోసారి మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. శుక్రవారం పెద్దచెరువు ప్రాంతంలో మాక్ డ్రిల్ ఏర్పాట్లను జిల్లా ఫైర్ సేఫ్టీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఈ నెల 24న జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనుండగా, ఆయా శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్‌ను ఈ నెల 25న చేపట్టనున్నారు.

News March 20, 2026

అనకాపల్లి: పెరిగిన పవర్ పెట్రోల్ ధర

image

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం నేపథ్యంలో అనకాపల్లిలో పవర్ పెట్రోల్ ధర పెరిగింది. పెరిగిన ధర శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చిందని కోటవురట్లలో పెట్రోల్ బంక్ యాజమాన్యం తెలిపింది. లీటరు పవర్ పెట్రోల్ ధర ఉదయం 6 గంటలకు ముందు వరకు రూ.116.87 ఉండగా.. 6 గంటల తర్వాత నుంచి రూ.119.06కి పెరిగింది. సాధారణ పెట్రోల్ ధరలు పెరగలేదు.