News November 6, 2025
సచివాలయాలకు అందరికీ ఆమోదయోగ్యమైన పేరే: మంత్రి డోలా

AP: ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుందని మంత్రి విమర్శించారు.
Similar News
News March 4, 2026
ఇరాన్తో యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ!

అమెరికా-ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు. ఈ క్రమంలో ఖతర్లోని యూఎస్ స్పేస్ ఫోర్స్కు చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ను ఇరాన్ డ్రోన్లతో నాశనం చేసింది. మొత్తంగా $1.1 బిలియన్లు నష్టం సంభవించినట్లు నిపుణుల అంచనా. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో మిస్సైల్స్ దాడులను గుర్తించే వ్యవస్థ దెబ్బతినిందని, US దళాలు కొంతకాలం బ్లైండ్గా ఆపరేట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
News March 4, 2026
ఇరాన్పై 3 డేంజరస్ బాంబర్లతో US దాడి

ఇరాన్పై అమెరికా 3 భారీ బాంబర్లను ఉపయోగించింది. అవి B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, B-1 లాన్సర్, B-2 స్పిరిట్. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 31వేల KGల బరువైన బాంబులను మోసుకెళ్తుంది. B-1 లాన్సర్ సూపర్సోనిక్, ఫాస్టెస్ట్ బాంబర్. ఇది 35వేల కేజీల బాంబులను శత్రు స్థావరాలపై వేస్తుంది. ఇక B-2 స్పిరిట్ మోస్ట్ డేంజరస్. రాడార్లకు చిక్కకుండా 50వేల అడుగుల ఎత్తుపై నుంచి బాంబులను వదులుతుంది. దీని ధర దాదాపు ₹20వేల కోట్లు.
News March 4, 2026
ఇరాన్ పోరాటం వెనుక చైనా బలం!

US-ఇజ్రాయెల్కు ఇరాన్ దీటుగా బదులిస్తోంది. వాటిని టార్గెట్ చేస్తూనే UAE, ఒమన్, సౌదీ సహా 11 దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ పోరాటానికి రహస్యంగా చైనా సాయపడిందని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణులు, ఇతర అత్యాధునిక వెపన్స్తోపాటు కీలక సాంకేతికతను సరఫరా చేసిందని చెబుతున్నాయి. చైనా అండ లేకపోతే ఇరాన్ నిలబడేది కాదంటున్నాయి. శత్రువులపై కచ్చితత్వంతో చేస్తున్న దాడులను ఉదహరిస్తున్నాయి.


