News April 11, 2024
జూన్ 14 వరకు చేపల వేట నిషేదం

బంగాళాఖాతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధించినట్లు కోట ప్రాంత మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రెడ్డి నాయక్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో మరబోట్లతో వేట నిషేధించామని వెల్లడించారు. ఉల్లంఘించిన వారి మరబోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు డీజిల్, ఇతర రాయితీలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News March 22, 2026
కావలి: ఆ బోట్ల విడుదల వెనకున్న నేత ఎవరు..?

కొన్ని నెలల నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉన్న ఆ బోట్లను విడిపించడంలో కీలకంగా వ్యవహరించిన నేత ఎవరు? ఆయనకు దాని వలన వచ్చే లాభం ఏమిటనేది ప్రస్తుతం జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో ఎంపీ బీద మస్తాన్ రావు వీడియో షేర్ చేసి క్లారిటీ ఇవ్వగా.. ఇంత గొడవ జరిగినా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పందించలేదని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల తీర ప్రాంత సమస్య కావడంతో ఈ విషయం సమస్యాత్మకంగా మారుతోంది.
News March 22, 2026
సైదాపురం మైకా గనులపై MP కన్ను: YCP

సైదాపురంలోని మైకా గనులను ఇష్టానుసారం తవ్వుకునేందుకు కూటమి పెద్దలు పథకం సిద్ధం చేశారని YCP ఆరోపించింది. ‘ఇప్పటికే లీజు ముగిసిపోయిన గనుల్లో ఇంకా తవ్వకాలు జరుపుతూ రూ.వందల కోట్ల పెనాల్టీకి గురైన సంస్థలను ప్రభుత్వం వెనకేసుకు వస్తోంది. ఆ పెనాల్టీ చెల్లించనక్కర లేకుండానే వారికి లీజును కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేస్తోంది. దీని వెనక TDP ముఖ్య నేతతో పాటు MP ఉన్నట్లుగా తెలిసింది’ అంటూ ‘X’లో రాసుకొచ్చింది.
News March 22, 2026
నెల్లూరులో దారుణ హత్య.. మృతుడి వివరాలు ఇవే!

నెల్లూరు బోడిగాడి తోటలోని శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి<<19446783>> దారుణ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. నవాబ్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వీర్ క్రాంత్ అని, వలస కూలీ అని చెబుతున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా వివరాలు తెలిసినట్టు సమాచారం.


