News November 6, 2025
KNR: ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి.. అయినా ఈ పరిస్థితి..!

ఉమ్మడి KNR జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిపే ఘటన ఇది. మానకొండూరు(M) పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు బస్సులు లేక రాత్రయినా రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. అసలే చీకటి,సీసీ కెమెరాలు లేని ప్రాంతం, అమ్మాయిల భద్రతకు బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి ఉన్న జిల్లాలో ఈపరిస్థితి ఏంటని అంటున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Similar News
News March 24, 2026
KNR: పాపం పసిప్రాణాలు.. ఓ కన్నేయండి.!

చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రోజురోజుకు తగ్గిపోతుంది. ఇటీవల ప్రమాదవశాత్తు చిన్నారులు మృతి చెందిన ఘటనలు చాలానే జరిగాయి. PDPL(D) ధర్మారం(M) కటికెనపల్లికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు అభిరాం (6) సోమవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతిచెందగా.. KNR(D) శంకరపట్నం(M) కేశవపట్నం హైవేపై ఆదివారం లారీ ఢీకొనడంతో మూడేళ్ళ బాలిక మృతి చెందింది. JGTL(D)లో కుక్క కాటుకు గురై మణితేజ(7) బాలుడు మృతి చెందాడు.
News March 24, 2026
నాసిక్ దొంగ బాబా.. గర్భవతినీ వదల్లేదు

నాసిక్ (MH) దొంగ బాబా అశోక్ ఖారత్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజలు చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని నమ్మించి ఒక గర్భవతిని దారుణంగా రేప్ చేశాడు. పెళ్లి కుదురుతుందని నమ్మబలికి మరో యువతిని లోబర్చుకున్నాడు. ఇప్పటికే అరెస్టైన ఈ దొంగ బాబాపై ఇప్పుడు మరిన్ని కేసులు నమోదయ్యాయి. అలాగే కిలో ₹100 దొరికే చింతపిక్కలను రత్నాలంటూ ఒక్కోదాన్ని ₹10,000కు అమ్మి భక్తుల వీక్నెస్తో ఆడుకున్నాడు.
News March 24, 2026
సంగారెడ్డి: ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్

జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 28న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ కోర్టులలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రాజీ పడదగ్గ కేసులను కక్షిదారులు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.


