News November 7, 2025
నవీన్ యాదవ్పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News March 16, 2026
HYDలో అంతా మా ఇష్టం!

HYDలో గ్యాస్ కొరత వార్తలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. బషీర్బాగ్లోని ఫుల్బాగ్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ ధరలు పెరిగాయనే నెపంతో ప్రతి ఫుడ్ ఐటమ్ మీద అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా పెంచుతోన్న ధరలతో సామాన్య ప్రజలు వాపోతున్నారు. కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.
News March 15, 2026
ALERT: HYDలో ఈ రూట్లలో వెళ్లొద్దు

HYDలో నేడు భారీ ఈవెంట్లు జరగనున్నాయి. యూసుఫ్గూడలో ‘<<19385959>>ఉస్తాద్ భగత్ సింగ్<<>>’ ప్రీరిలీజ్, LBస్టేడియంలో ‘ఇఫ్తార్’తో రోడ్లు క్లోజ్ అవ్వనున్నాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్↦ KVBR స్టేడియం↦ పంజాగుట్ట, మైత్రీవనం↦ కృష్ణానగర్ జంక్షన్↦ జూబ్లీహిల్స్, మాదాపూర్..
ఎల్బీస్టేడియం↦ ARపెట్రోల్ పంప్, బషీర్బాగ్, సుజాత స్కూల్ రోడ్లు క్లోజ్ అవుతాయి. లక్డికాపూల్, రవీంద్రభారతి, లిబర్టీ వద్ద రద్దీ ఉంటుందని పోలీసులు తెలిపారు.
News March 15, 2026
ఓటుకు నోటు.. అసెంబ్లీలో ఫైటు: అంతా తుస్సు!

‘కారు’ దిగి ‘చేయి’ వచ్చినా కాళేశ్వరం, మూసీ కూల్చివేతలపై సభ కుదిపేయనుంది. నిధుల కొరతతో సర్కార్, ఫిరాయింపులతో విపక్షం కత్తులు నూరుతున్నాయి. బయ్యారం ఉక్కు, గిరిజన వర్సిటీ కాగితాలకే పరిమితం కాగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రిపేర్ యూనిట్గా మారింది. కమలం విభజన హామీలని మర్చిపోగా పతంగి, కొత్త బీసీ పార్టీలు, ఎర్రజెండా అంతా ఓటు బ్యాంకు రాజకీయంలో మునిగారు. ఇందులో అమ్మడుపోయిన ఓటర్లూ బాధ్యులే. దీనిపై మీ కామెంట్?


