News November 7, 2025
గోదావరిఖని: త్వరలో 473 మందికి కారుణ్య ఉత్తర్వులు

సింగరేణిలో మెడికల్ పూర్తి చేసి ఇప్పటి వరకు కారుణ్య నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది అభ్యర్థులకు ఈనెల 12న కొత్తగూడెం వేదికగా నియామక పత్రాలు అందజేస్తామని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేస్తారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపై తాము తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఇది జరుగనుందని తెలిపారు.
Similar News
News March 19, 2026
రంజాన్ ఎల్లుండే..

భారత్లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
News March 19, 2026
జిల్లాలో ఘనంగా ఉగాది.. ఊరూరా పంచాంగ శ్రవణాలు

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన జిల్లాలోని గ్రామగ్రామాన పంచాంగ శ్రవణాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోయే మంచి చెడులను పూజారులు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు హాజరయ్యారు.
News March 19, 2026
రేపే బడ్జెట్.. ఆరు కొత్త పథకాలు!

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ ఇండియా కిట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.


