News November 7, 2025
బొబ్బిలి: టీచర్కు రూ.22లక్షల టోకరా.. నిందితుల అరెస్ట్

మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ బొబ్బిలికి చెందిన టీచర్ నుంచి రూ.22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన సునీల్ సుతార్, సతీష్, రాజేష్ పాల్, మహ్మద్ ఇర్ఫాన్ను అరెస్ట్ చేసినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ప్రధాన నిందితుడైన రాజస్థాన్ వాసి వినోద్ చౌదరి పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన DSP భవ్యరెడ్డి, CI సతీశ్ కుమార్ను అభినందించారు.
Similar News
News March 16, 2026
ఆస్కార్-2026 చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

* వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- జియో హాట్స్టార్
* సిన్నర్స్- జియో హాట్స్టార్
* ఫ్రాంకెన్స్టైన్- నెట్ఫ్లిక్స్
* కెపాప్ డీమన్ హంటర్స్- నెట్ఫ్లిక్స్
* వెపన్స్- జియో హాట్స్టార్
* F1- ప్రైమ్ వీడియో(రెంట్), ఆపిల్ టీవీ
News March 16, 2026
MHBD: ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు

మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ ఉపాధ్యాయులకు పలు ఆదేశాలు జారీ చేశారు. టెన్త్ పరీక్షలు లేని రోజు సి.ఎస్, డి.ఓ, ఇన్విజిలేటర్ అందరూ తమ పాఠశాలలో హాజరు కావాలని ఆదేశించారు. FA 4, ఎండ్ లైన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్, పెండింగ్ లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఉపాధ్యాయులకు నిబంధనలను తెలియజేయాలని సూచించారు.
News March 16, 2026
కరీంనగర్ ప్రాజెక్టులకు బడ్జెట్ మోక్షం కలిగేనా..?

కరీంనగర్ నగరానికి మణిహారాలైన కేబుల్ బ్రిడ్జి అనుబంధ పనులు, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. అటు కరీంనగర్-వీణవకం రహదారి విస్తరణ, మరమ్మతులు, కల్వల ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు కూడా ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యత దక్కుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.


