News November 7, 2025
ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టండి

సాధారణంగా రాత్రుళ్లు మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, భవిష్యత్ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. ఏదైనా పనిచేశాక ఫలితాన్ని దానికే వదిలెయ్యాలి. వరుస వైఫల్యాలు ఎదురవుతోంటే మనసు గాయపడి ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కానీ వాటిని పక్కనపెట్టి తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా విజయం సాధించవచ్చని ఆలోచించండి.
Similar News
News November 7, 2025
BJP, BRS కుమ్మక్కు: మంత్రి పొన్నం

TG: జూబ్లీహిల్స్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25వేల ఓట్లు సాధించిన బీజేపీకి.. 2024 ఎంపీ ఎన్నికల్లో అక్కడే 64 వేల ఓట్లు ఎలా వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ‘2023లో BRSకు 80 వేల ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్లే ఎందుకు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి BRS మద్దతు ఇస్తే శాసనసభ ఎన్నికల్లో BRSకు BJP మద్దతు ఇచ్చింది’ అని ఆరోపించారు.
News November 7, 2025
వీధి కుక్కలు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి: సుప్రీంకోర్టు

వీధికుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ‘స్కూల్స్, రైల్వే స్టేషన్స్, ఆస్పత్రుల్లోకి వీధికుక్కలు రాకుండా 8 వారాల్లో ఫెన్సింగ్ వేయాలి. NH, ఎక్స్ప్రెస్ హైవేలపైకి మూగజీవాలు రాకుండా చూడాలి. పబ్లిక్ ఏరియాల్లో స్ట్రే డాగ్స్ తిరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించింది. అమికస్ క్యూరీ దీనిపై నివేదిక అందించాలంది. అమలుపై అఫిడవిట్లు వేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
News November 7, 2025
నువ్వులతో ఎన్నో లాభాలు

నువ్వుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. హైబీపీ, హై కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ఎముకల దృఢత్వాన్ని పెంచడంలోనూ నువ్వులు సహాయం చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే శరీర మెటబాలిజం, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


