News November 7, 2025

NGKL: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ దిశా నిర్దేశం

image

జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ పి. అమరేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ ల్యాండ్ సర్వే నాగేందర్ సర్వేయర్లకు సూచనలు చేశారు. జిల్లాలో నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలోని సర్వేయర్లు అంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Similar News

News November 7, 2025

PRG: సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలి.. ఒకరి మృతి

image

పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నారీ జిల్లాకు చెందిన కార్మికుడు మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్‌తో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI మోహనకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 7, 2025

నేడు పేర్కంకంపల్లికి ఎమ్మెల్సీ కవిత

image

యాలాల: చేవెళ్ల బస్సు ప్రమాదంలో పెర్కంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియా, తనుష, నందిని మరణించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు MLC కవిత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్నారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

News November 7, 2025

అక్బర్‌పేట-భూంపల్లి: అరుదైన ఘటన.. ఆవుకు రెండు దూడలు

image

అక్బర్‌పేట- భూంపల్లి మండలం అగ్రహారం గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రైతు సాదుల సురేష్‌కు చెందిన గోమాత ఒకే ప్రసవంలో రెండు లేగదూడలకు (మగ, ఆడ) జన్మనిచ్చింది. ఒక గంట వ్యవధిలో ఈ దూడలు పుట్టడంపై రైతు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అరుదైన దృశ్యం కావడంతో పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి చూస్తున్నారు.