News November 7, 2025

పల్నాడు యుద్ధం ఎందుకు జరిగింది..!

image

పల్నాటి యుద్ధానికి దాయాదుల రాజ్యాధికార పోరు ప్రధాన కారణమని చరిత్రకారులు పేర్కొన్నారు. నలగామరాజు, మలిదేవరాజు మధ్య కోడిపందేలు జరిగాయి. ఓడిన మలిదేవరాజు ఏడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత కూడా రాజ్యం ఇవ్వకపోవడం, రాయబారి హత్యతో ఈ భీకర సంగ్రామం మొదలైందని చెబుతుంటారు. దీనికి అదనంగా వైష్ణవ సంస్కర్త బ్రహ్మనాయుడు, శైవ సంప్రదాయవాది నాయకురాలు నాగమ్మల మధ్య మత, సామాజిక వైరుధ్యాలు తోడయ్యాయని పేర్కొన్నారు.

Similar News

News March 15, 2026

పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం

image

AP: TDP MP పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఘటనపై వివరణ కోరుతూ మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని, పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని CBN స్పష్టం చేశారు. నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని తేల్చిచెప్పారు.

News March 15, 2026

ANU: సజావుగా దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా జరిగినట్లు CDE వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ANUలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలలో 736 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని 670 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. ఈ నెల 17న సాయంత్రం ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

News March 15, 2026

చలో స్టేషన్ ఘన్‌పూర్.. భారీగా తరలివెళ్లిన బీఎస్పీ శ్రేణులు

image

మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహిస్తున్న ‘చలో స్టేషన్ ఘన్‌పూర్’ సభకు పెద్దపల్లి జిల్లా నుండి BSP శ్రేణులు భారీగా తరలివెళ్లారు. BSP జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ యాదవ్, మంథని నియోజకవర్గ ఇంచార్జి జనగామ రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంనుండి బస్సుల్లో బయలుదేరారు. కాన్షీరామ్ ఆశయ సాధన కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.