News November 7, 2025
రాజన్న ఆలయం పడమరవైపు గేటు మూసివేత

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం పడమరవైపు గేటును మూసివేశారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో రాజన్న ఆలయంలో సాధారణ దర్శనాలు కొనసాగిస్తున్న అధికారులు అన్నిరకాల ఆర్జిత సేవలను భీమేశ్వరాలయానికి మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పడమరవైపు స్వాగత ద్వారానికి అడ్డంగా రేకులను అమర్చారు. పీఆర్ఓ కార్యాలయ మార్గం నుంచి ఆలయంలోపలికి వెళ్లకుండా అక్కడ కూడా రేకులను అడ్డుగాపెట్టి రాకపోకలను నిలిపివేశారు.
Similar News
News March 12, 2026
TODAY HEADLINES

* గల్ఫ్ పరిస్థితులపై ఆందోళన చెందొద్దు: ప్రధాని మోదీ
* LPG ఉత్పత్తిని 25% పెంచాం: కేంద్రం
* ఎక్కడా గ్యాస్ కొరత లేదు: CM చంద్రబాబు
* క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు: జగన్
* ఖమ్మం భూదాన్ భూములను పేదలకే వాడతాం: భట్టి
* తెలంగాణలో మూడో డిస్కం
* లోక్సభ స్పీకర్పై వీగిన అవిశ్వాసం
* గుజరాత్కు వస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. ఖండించిన భారత్
* IPL తొలి దశ షెడ్యూల్ రిలీజ్
News March 12, 2026
పిల్లల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

13ఏళ్లలోపు పిల్లలకు యాడ్స్ లేకుండా కేవలం ఫోన్స్, మెసేజెస్కే యాక్సెస్ ఉండేలా పేరెంట్ లింక్డ్ అకౌంట్ ఫీచర్ను వాట్సాప్ లాంచ్ చేసింది. ఈ అకౌంట్ సెటప్ చేసేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి పిల్లల ఫోన్తో పేరెంట్స్ అకౌంట్ లింకప్ చేసుకోవాలి. వాళ్లు కాంటాక్ట్స్ను యాడ్/బ్లాక్/రిపోర్ట్ చేసినా పేరెంట్స్కు నోటిఫై అవుతుంది. 6 డిజిట్ పిన్తో పిల్లల అకౌంట్ సెట్టింగ్స్ మార్చే యాక్సెస్ పేరెంట్స్కు కల్పించింది.
News March 12, 2026
ఇరాన్ దాడిని ఖండించిన భారత్

గుజరాత్కు వస్తున్న థాయిలాండ్ కార్గో షిప్ ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడి చేయడాన్ని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ దాడులు ప్రారంభమైన తొలి దశలోనే భారతీయులు సహా ఎంతో మంది ప్రాణాలు పోయాయని.. వీటి తీవ్రత మరింత పెరిగేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా థాయ్ షిప్పై దాడి ఘటనలో 20 మందిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.


