News November 7, 2025
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.
Similar News
News March 3, 2026
డ్రోన్ల యుద్ధం!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతున్నారు. ఇవాళ రియాద్పై, నిన్న అరామ్కో ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ డ్రోన్లతోనే దాడి చేసింది. మిస్సైళ్లతో పోలిస్తే ధర చాలా తక్కువ కావడంతో వీటి వాడకం ఎక్కువైంది. ఇరాన్ Shahed-136 సిరీస్, తుఫాన్.. అమెరికా లూకాస్ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఒక్కో డ్రోన్ ధర సుమారు $35,000–$50,000 కాగా, ఓ మీడియం రేంజ్ మిస్సైల్ ధర $2M-$3M ఉంటుంది.
News March 3, 2026
ముచ్చటగా మూడోసారి ఎవరిదో పైచేయి!

T20 WC సెమీస్లో ఎల్లుండి IND-ENG తలపడనున్నాయి. WC చరిత్రలో 2జట్లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలిచాయి. 2022 WC సెమీస్లో భారత్పై ఇంగ్లండ్ గెలవగా 2024లో ఇంగ్లిష్ జట్టును ఇండియా చిత్తు చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే 2సార్లు సెమీస్లో గెలిచిన జట్టే అంతిమంగా టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి ఎవరు గెలిచి కప్పు కొడతారనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రెండు జట్లూ బలంగా ఉన్నాయి.
News March 3, 2026
ఖమేనీ కోసం కెమెరాలు, మొబైల్ నెట్వర్క్ హ్యాక్?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ ఏళ్లుగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా ఇరాన్లోని ట్రాఫిక్ కెమెరాలన్నింటినీ హ్యాక్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అక్కడి మొబైల్ నెట్వర్క్లోకీ చొరబడి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఇది కొన్నేళ్లపాటు జరిగినట్లు వెల్లడించింది. ఖమేనీ బాడీగార్డ్స్ కదలికల్ని స్పష్టంగా పసిగట్టగలిగే కెమెరా ఒకటి బాగా ఉపయోగపడినట్లు సమాచారం.


