News November 7, 2025

ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

image

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

ఈనెల 21న రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ పోటీలు

image

ఈనెల 21, 22వ తేదీల్లో కర్నూలు శివారులోని రిడ్జ్ పాఠశాల క్రీడా మైదానంలో ఏపీ స్టేట్ అస్మిత రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రగ్బీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు బుధవారం వెల్లడించారు. అండర్-15 సబ్ జూనియర్ విభాగంలో బాలికలకు, సీనియర్ విభాగంలో మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు కప్పు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.

News March 18, 2026

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకండి: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వకుండా చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి డీపీవో భాస్కర్‌ను టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. బుధవారం ఓటర్ల మ్యాపింగ్, తాగునీటి సమస్య, శానిటేషన్ అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. 484 గ్రామ పంచాయతీలలో ఓటర్లను మ్యాప్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేశారా, లేదా అనేది చూసుకోవాలని పేర్కొన్నారు.

News March 18, 2026

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్

image

దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలు బస్టాండ్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి కలెక్టర్ బస్సు ప్రయాణం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున సంక్షేమానికి సీఎం చంద్రబాబు 70 ఏళ్ల వయసులోనూ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.