News April 11, 2024
చైనాలో కోరింత దగ్గు విజృంభణ

కరోనా తర్వాత చైనాను మరో జబ్బు వణికిస్తోంది. ఆ దేశంలో కోరింత దగ్గు కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మునుపెన్నడూ లేనంతగా ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 13మంది మరణించారు. 2023లో ఇదే సమయంలో 1,421 కేసులు నమోదవగా 2024లో ఏకంగా 32,380 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు కోరింత దగ్గుకు చైనా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.
Similar News
News March 20, 2026
జొమాటో కస్టమర్లకు షాక్.. ప్లాట్ఫామ్ ఫీజు పెంపు

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్ఫామ్ ఫీజును ఆర్డర్పై రూ.2.40 చొప్పున పెంచింది. దీంతో రూ.12.50 నుంచి రూ.14.90కి పెరిగింది. పోటీ కంపెనీ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్పై రూ.14.99 చొప్పున వసూలు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిన కారణంగానే ప్లాట్ఫామ్ ఫీజును పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల డెలివరీ పార్ట్నర్లతోపాటు రెస్టారెంట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
News March 20, 2026
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <
Share It
News March 20, 2026
2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్చాట్లో తెలిపారు.


