News November 7, 2025

వాలీబాల్ జట్టుకు ఎంపికైన ములుగు జిల్లా క్రీడాకారులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ జట్టుకు ములుగు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరగనున్న తెలంగాణా సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ములుగు జిల్లా వాలీబాల్ క్రీడాకారులు.. నాలి తరుణ్, కొమరం ఉదయ్, గొంది వసంత్, సోయం నర్సింహ, కొమరం సునీల్, శివ, నరేందర్ ఎంపికయ్యారు.

Similar News

News March 16, 2026

వడదెబ్బ నివారణపై అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

image

వడదెబ్బ నివారణపై బాపట్లలోని కలెక్టర్ అవగాహన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదన్నారు. తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News March 16, 2026

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తాం: సీఎం

image

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరఫున విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఇమామ్, మౌజన్లకు రూ. 5 వేలు, రూ. 10 వేల చొప్పున రూ. 180 కోట్లు అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించామన్నారు.

News March 16, 2026

100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలి

image

బెట్టింగులు, నిషేధిత గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా పోలీసులకు ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరిగిన నేర సమీక్షలో మాట్లాడుతూ.. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని బాధితులకు అండగా నిలవాలన్నారు.