News November 7, 2025
GDK: బంగారు పతకాలు అందుకున్న ఎంబీఏ విద్యార్థులు

గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంబీఏ విద్యార్థులు బంగారు పతకాలను అందుకున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను డీ.తరుణ, ఎం.మౌనిక, డీ.ఉషశ్రీ, పీ.కళ్యాణి, కే.కళ్యాణి, సీహేచ్.సాగరికలు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ బంగారు పతకాలు అందుకున్నారు.
Similar News
News March 15, 2026
విజయవాడలో ధరల సెగ.. కేజీ చికెన్ ఎంతంటే!

ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడలో మాంసం మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అయితే ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ స్కిన్లెస్ కిలో రూ. 340 పలుకుతుండగా, మటన్ రూ. 900 వద్ద కొనసాగుతోంది. చేపలు, గుడ్ల ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రాంతాలను బట్టి స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 15, 2026
వరంగల్: కొత్త మోసాలు.. ప్రజలకు పోలీసుల ALERT

ఫోన్ కాల్స్ ద్వారా “డిజిటల్ అరెస్ట్” చేస్తామంటూ బెదిరించే ముఠాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. చట్టంలో “డిజిటల్ అరెస్ట్” అనే పదమే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరించి డబ్బులు అడిగితే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
News March 15, 2026
వరంగల్: ‘డ్రగ్స్కు దూరంగా ఉండండి’

యువత మత్తుకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వరంగల్ పోలీసులు సూచించారు. ‘Say No to Drugs’ ప్రచారంలో భాగంగా అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 1908 లేదా 8712671111 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు స్పష్టం చేశారు.


