News November 8, 2025
సీఐడీ విచారణకు హాజరైన రవికుమార్..!

పరకామణి చోరీ కేసులో విచారణకు నోటీసులు అందుకున్న నిందితుడు రవి కుమార్ శుక్రవారం విచారణకు హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతికి చేరుకున్న రవికుమార్, అతని భార్య సహా మరికొందరిని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారించారు. శనివారం కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News March 22, 2026
NGKL: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’

నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకానున్నాయి. తొలిదశలో ఎకరా లోపు భూమి ఉన్నవారికి పెట్టుబడి సాయం అందనుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని 3.41 లక్షల మంది రైతులకు గాను మొత్తం రూ.415.23 కోట్లు జమ చేయనున్నారు. జిల్లాలో సుమారు 8.30 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తించనుంది.
News March 22, 2026
ఏప్రిల్ నుంచి లైసెన్స్కు మూడు పరీక్షలు?

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.
News March 22, 2026
వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.


