News November 8, 2025
MDK: రేవంత్కు ఓటమి భయం.. పథకాలు ఆయన జాగీరా?: హరీశ్ రావు

కాంగ్రెస్కు ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని రేవంత్ రెడ్డి అనడంపై హరీశ్ రావు మండిపడ్డారు. పథకాలు ఆపడానికి ఇది రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని ప్రశ్నించారు. అది ప్రజల సొమ్ము అని, ప్రజలకు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. ఓటమి భయం వల్లే రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. హైదరాబాద్లోని ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News March 18, 2026
ఇంటికే గ్యాస్.. ఏజెన్సీల వద్ద వేచి ఉండొద్దు: కేంద్రం

గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని, సిలిండర్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తామని వెల్లడించింది. IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, <<19379922>>మిస్డ్కాల్<<>>, UPI యాప్స్ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.
News March 18, 2026
నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి: మేఘారెడ్డి

పట్టణంలో నీటి ఎద్దడి రాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని లేదంటే సెలవు పెట్టి వెళ్లాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి సమస్యపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరెంటు అంతరాయం లేకుండా చూడాలని ఎస్.ఈ తిరుపతయ్యను, మిషన్ భగీరథ నీరు సరఫరా లేకుండా చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
News March 18, 2026
భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు రీ షెడ్యూలు

విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సిన భవానిపట్నం ప్యాసింజర్ (58504) రైలు బుధవారం రీ షెడ్యూలు అయింది. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.


