News November 8, 2025

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం: నాగరాణి

image

జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం యశస్వి పథకం ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి నాగరాణి తెలిపారు. 9 తరగతి, 10వ తరగతి, ఇంటర్ ప్రధమ, ద్వితీయ ఏడాది చదువుచున్న బీసీ, ఈబీసీ సంచార జాతుల కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు https://vet.nta.ac.in వెబ్ సైట్‌ను పరిశీలించాలని సూచించారు. ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News March 4, 2026

WNP: ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు.. DIEO

image

ఇంటర్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో డీఐఈవో ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.

News March 4, 2026

యుద్ధంతో వీటి ధరలు పెరుగుతాయ్!

image

ఇరాన్ వార్‌తో మనదేశంలో కంది, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5-6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, అఫ్గాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు, ఆప్రికాట్‌ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి.

News March 4, 2026

కర్నూలు: నా భర్తను కనిపెట్టండి.. భార్య ఆవేదన!

image

దేవనకొండ మండలం బండగట్టుకు చెందిన కురువ ధర్మ, కురువ మౌనిక ఇష్టంతో వివాహం చేసుకున్నారు. వారం తర్వాత ధర్మ కనిపించకపోవడంతో మౌనిక తీవ్ర ఆందోళనకు గురైంది. భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతని ఇంటి ముందు కూర్చొని “నాకు న్యాయం చేయాలి, నా భర్తను కనిపెట్టండి” అంటూ వేడుకుంటోంది. అయితే ధర్మ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి అనుమతించడం లేదు.