News November 8, 2025
రూ.240 కోట్ల లాటరీ విజేత.. మన ఖమ్మం వాసే..!

దుబాయ్లో ఇటీవల నిర్వహించిన అతిపెద్ద లాటరీలో మన తెలుగింటి యువకుడు జాక్పాట్ కొట్టాడు. రూ.240 కోట్ల బహుమతి గెలుచుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి బోల్లా అనిల్కుమార్, వేంసూరు(M) భీమవరం గ్రామ వాసి. సాధారణ రైతు దంపతుల కుమారుడైన అనిల్, ఏడాదిన్నర క్రితం యూఏఈకి వెళ్లారు. ఇటీవల తన తల్లి పుట్టిన రోజు తేదీతో ఉన్న లాటరీ నెంబరుతో జాక్పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆయన జీవితం మారిపోయింది.
Similar News
News April 6, 2026
ఉమ్మడి ADB జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు NRML, ADB జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బాసర చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ పనులకు భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ADB జిల్లా పిప్రి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు, అవార్డులను అందజేస్తారు. తిరిగి సాయంత్రం 5:30 గం.లకి HYD వెళ్తారు.
News April 6, 2026
తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్-2 చరిత్ర సృష్టించింది. దేశంలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ఘనత సాధించింది. నిన్న 18వ రోజు దేశవ్యాప్తంగా 4,030లు షోలు పడగా రూ.3.82 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లు (రూ.1,234 కోట్లు) సాధించిన రికార్డు పుష్ప-2 పేరిట ఉంది. ఆ తర్వాత బాహుబలి-2 రూ.1,030 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
News April 6, 2026
విజయవాడలో గంజాయి స్వాధీనం

గంజాయి అక్రమ రవాణాపై విజయవాడలో పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆదివారం కండ్రిక జంక్షన్ వద్ద రత్నాకుమార్ అనే వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అతన్ని తనిఖీ చేయగా రత్నకుమార్ వద్ద 1.5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు.


