News November 8, 2025

ఆలమూరు: దివంగత ఎస్ఐ అశోక్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

image

ఆలమూరు ఎస్ఐగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎం. అశోక్ కుమారుడు ఎం. సత్యసాయికిరణ్ నవనీత్‌కు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. శుక్రవారం అతనికి రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా రావులపాలెం సీఐ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐ నరేశ్, ఇతర సిబ్బంది సత్యసాయికిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Similar News

News March 5, 2026

కామారెడ్డి: కలెక్టర్‌ను కలిసిన ఈఈ అశోక్

image

తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఈఈ అశోక్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యాసంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై చర్చించారు.

News March 5, 2026

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం పేరు మార్పు

image

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావు పేరు పెట్టారు. వెంగళరావు పేరు పెట్టేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌లకు మున్సిపాలిటీ ప్రజలు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దృఢమైన పునాదులు వేశారు.

News March 5, 2026

10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు Arrive-Alive కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహిస్తారని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.