News April 11, 2024

విశాఖ: కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం

image

విశాఖలో ద్వారక నగర్ ఐఓబీలో ఎస్పీఎఫ్ <<13030401>>కానిస్టేబుల్ శంకరరావు<<>> ఆత్మహత్య ఘటన ఆయన కుటుంబంలో పెను విషాదం నింపింది. ఉ.5 గంటలకు విధులకు వచ్చిన శంకర్రావు..7 గంటలకు తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిది వంగర మండలం పొత్తిస గ్రామంగా సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా.. కానిస్టేబుల్ ఛాతీపై కాల్చుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 6, 2025

విశాఖ: ఏ జోన్‌లో ఎంతమంది వర్తకులున్నారంటే?

image

ఇటీవల యూసీడీ (UCD) విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీలోని వీధి వర్తకుల సర్వే పూర్తయింది. ఎనిమిది జోన్‌ల పరిధిలో 18,041 మంది వ్యాపారులను గుర్తించారు. జోన్‌-1 పరిధిలో 217 మంది, జోన్‌-2లో 2,965, జోన్‌-3లో 3,615, జోన్‌-4లో 2,879, జోన్‌-5లో 3,510, జోన్‌-6లో 2,152, జోన్‌-7లో 154, జోన్‌-8లో 2,549 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. <<17922542>>వెండింగ్‌ జోన్ల<<>>ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

News October 6, 2025

5గంటల ఆలస్యంగా తిరుపతి-హౌరా ఎక్సప్రెస్

image

ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన తిరుపతి-హౌరా ఎక్సప్రెస్(20890) 5 గంటల లేటులో నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలియన కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ చేసుకున్న వారు వేరే మార్గం లేక వేచి ఉండాల్సి వచ్చింది.

News October 5, 2025

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

image

విశాఖ విమానాశ్రయానికి కేంద్రమంత్రి జలరవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనావాల్ ఆదివారం రాత్రి చేరుకున్నారు. సోమవారం విశాఖ పోర్టులో భారీ క్యారియర్ నౌక చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి స్వాగతం పలకనున్నారు. సాగర్‌మాల ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ ఇతర అధికారులు ఉన్నారు.