News November 8, 2025

NLG: అప్రెంటిషిప్‌కు దరఖాస్తు చేసుకోండి

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళాకు ఈనెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ అనుముల ప్రిన్సిపల్ మల్లిఖార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. www.apprenticeship.gov.in లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాలకు 86868 80100, 83413 87860 నెంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

NTR: జాబ్ కోసం సెర్చ్.. భారీ మోసం

image

OLXలో ఉద్యోగం కోసం వెతికిన షేక్ అర్షద్ అనే యువకుడు మోసగాళ్ల చేతిలో చిక్కాడు. ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ప్రసాద్ అనే వ్యక్తి, అర్షద్ వద్ద రూ.3 లక్షలు వసూలు చేసి నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

News March 14, 2026

VZM: సురక్షిత ఉత్పత్తులే లక్ష్యం.. మోసపోతే ప్రశ్నించండి

image

వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ‘సురక్షిత ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

News March 14, 2026

‘500 మంది ‘సైబర్ సింబా’లకు శిక్షణ’

image

సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేరాలు ఆగడం లేదు. దీంతో ‘సైబర్ సింబా’ పేరుతో వాలంటీర్లను సిద్ధం చేశారు. తొలిదశలో 500 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు పోలీస్ స్టేషన్‌తో అనుసంధానమై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీరికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాల అడ్డుకట్టలో భాగం కావాలని పిలుపునిచ్చారు.