News November 8, 2025

ASF: 571 కేసులు.. 38 మంది అరెస్ట్.. 40 వాహనాలు సీజ్

image

ఆసిఫాబాద్ జిల్లాలో గుడుంబా, దేశీదారు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 571 గుడుంబా కేసులను నమోదు చేసి, 38 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో 40 వాహనాలను కూడా సీజ్ చేశారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, ప్రభావిత గ్రామాల్లో నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

image

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 8, 2025

మెదక్‌లో ముగిసిన జోనల్ స్థాయి మీట్

image

మూడు రోజులుగా మెదక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో జరిగిన రాజన్న సిరిసిల్ల 11వ జోనల్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల పీడీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్: ఓట్ల కోసం ఇంతకి దిగజారుతారా?: BRS

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. సునీత.. గోపీనాథ్ 3వ, 4వ భార్యనా అని అనుమానిస్తున్నారు.. ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఓ మహిళపై దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ విషయం స్పందించాలని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.